తెలంగాణ

telangana

By

Published : Apr 28, 2020, 9:07 PM IST

ETV Bharat / state

అకాల వర్షానికి తడిసి ముద్దయిన ధాన్యం

కరీంనగర్​ జిల్లాలో అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది. యార్డుల్లో టార్పాలిన్లు సరిపడా లేక అన్నదాతలు ఇబ్బందులు పడ్డారు. ధాన్యం తడిసిపోవడం వల్ల అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

A grain stained with premature rain in karimnagar districr
అకాల వర్షానికి తడిసి ముద్దయిన ధాన్యం

కరీంనగర్ జిల్లాలో కురిసిన అకాల వర్షానికి యార్డులో నిల్వ చేసిన రైతుల ధాన్యం తడిసి ముద్దయింది. ప్రతి గ్రామానికి ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరిపడా టార్పాలిన్లు లేకపోవడం వల్ల ఆరుబయట నిల్వచేసిన ధాన్యం తడిసిపోయింది. గత వారం రోజులుగా తాలు సమస్యతో తూకం నిలిచిపోగా రైతుల సర్దుబాటుతో కొనుగోళ్లు మొదలయ్యాయి.

కానీ అకాల వర్షానికి ధాన్యం ముద్దవడం వల్ల రైతులు ఆవేదన చెందుతున్నారు. రామడుగు, గంగాధర తదితర మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తడిసిన ధాన్యాన్ని ఎత్తుకునేందుకు అవస్థలు పడ్డారు.

ఇవీ చూడండి: లాక్​డౌన్​ కొనసాగించాలి: జగ్గారెడ్డి

ABOUT THE AUTHOR

...view details