తెలంగాణ

telangana

ETV Bharat / state

'కష్టపడి పనిచేసే వారిని భూమాత ఆశీర్వదిస్తుంది'

కష్టపడి పనిచేసే వారిని భూమాత ఆశీర్వదిస్తుందని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్​రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా మైలారంలో బీర్కూర్​ వ్యవసాయ మార్కెట్​ కమిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

telangana state assembly speaker pocharam srinivas reddy laid foundation for agriculture market committee building at mylaram  in kamareddy district
'కష్టపడి పనిచేసే వారిని భూమాత ఆశీర్వదిస్తుంది'

By

Published : Jan 12, 2020, 5:46 PM IST

కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం మైలారం గ్రామంలో రూ. 55 లక్షలతో నూతనంగా నిర్మించనున్న బీర్కూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నిర్మాణానికి రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు.

'కష్టపడి పనిచేసే వారిని భూమాత ఆశీర్వదిస్తుంది'

ఈ వ్యవసాయ మార్కెట్​లో 5వేల మెట్రిక్​ టన్నుల సామర్థ్యం గల గోడౌన్​ను నిర్మిస్తామని పోచారం తెలిపారు. కష్టపడి పనిచేసే వారిని భూమాత ఆశీర్వదిస్తుందన్నారు. రాష్ట్రంలో వరి ధాన్యం అత్యధికంగా బాన్సువాడ నుంచే దిగుబడి అవుతుందని వెల్లడించారు.

రాష్ట్ర రైతులకు ఉచిత విద్యుత్​ అందించడానికి ప్రభుత్వం ఏటా రూ.5వేల కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ యాదిరెడ్డి, తహసీల్దార్ గంగాధర్, ఎంపీపీ విట్టల్ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details