తెలంగాణ

telangana

నిరసనకు దిగిన ఎల్‌ఐసీ ఉద్యోగులు, ఏజెంట్లు

By

Published : Feb 6, 2020, 3:00 PM IST

ఎల్‌ఐసీను ప్రైవేట్‌ పరం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో సంస్థ ఉద్యోగులు నిరసనకు దిగారు.

lic employees and agents protest against government in kamareddy
నిరసనకు దిగిన ఎల్‌ఐసీ ఉద్యోగులు, ఏజెంట్లు

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎల్ఐసీ భవనం ఎదుట ఆ సంస్థ ఏజెంట్లు, ఉద్యోగులు బుధవారం ధర్నాకు దిగారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.

ఎల్‌ఐసీను పూర్తిగా ప్రైవేట్ పరం చేయడమనేది సమంజసం కాదని.. కొన్ని కోట్ల ప్రజాధనాన్ని ఒకరిద్దరు వ్యక్తలకు కట్టబెట్టడం సరైనది కాదని ఆరోపించారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని వెంటనే తీసుకోవాలని.. లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామన్నారు.

నిరసనకు దిగిన ఎల్‌ఐసీ ఉద్యోగులు, ఏజెంట్లు

ఇవీ చూడండి:రామప్ప చూడొచ్చు.. లక్నవరం మాత్రం వెళ్లలేము!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details