తెలంగాణ

telangana

ETV Bharat / state

మోటారు దించడానికి వెళ్లి.. బావిలో పడి'పోయారు'

ఇద్దరూ కలిసి చేను వద్ద ఉన్న బావిలో బోర్ మోటారు దించడానికి బయలుదేరారు. సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాలేదు. అనుమానం వచ్చి బావిలో చూస్తే శవాలుగా మారారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో చోటు చేసుకుంది.

farmers motors Going down the at agricultural well at kamareddy district
మోటారు దించడానికి వెళ్లి.. బావిలో పడి'పోయారు'

By

Published : Feb 29, 2020, 11:33 PM IST

కామారెడ్డి జిల్లాలో ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయారు. తాడ్వాయి మండలం కన్కల్​కు చెందిన కౌడి పోచయ్య బావిలో మోటారు దించడానికి... పల్లె అశోక్​ను తీసుకుని ఉదయం వెళ్లారు. ఇద్దరూ కలిసి బోర్ మోటారును బావిలోకి దించే ప్రయత్నంలో జారీ పడ్డారు. మధ్యాహ్నం అయినా ఇంటికి రాకపోయేసరికి పోచయ్య కొడుకు బావి వద్దకు వెళ్లి చూశాడు. అక్కడ వాళ్లు కనిపించలేదు కానీ బావి గడ్డపై బట్టలు కనిపించాయి.

అనుమానం వచ్చి బావిలో చూడగా శవాలై కనిపించారు. ఈ విషయాన్ని గ్రామస్థులకు తెలియజేయగా అందరూ బావి వద్దకు చేరుకున్నారు. పోలీసులకు సమాచారం తెలిసి ఘటనా స్థలానికి చేరుకునే సరికి రాత్రైంది. మృతదేహాలను బయటకు తీయడానికి సాధ్యపడలేదు. ఈ రోజు ఉదయం మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడు అశోక్​కు కొడుకు ఉండగా, ప్రస్తుతం ఆమె భార్య గర్భవతి అని తెలిసింది. మరో మృతుడు పోచయ్య భార్య మొగులవ్వ ఏమి తెలియని అమాయకురాలు.

మోటారు దించడానికి వెళ్లి.. బావిలో పడి'పోయారు'

ఇదీ చూడండి :కష్టాలు తెచ్చిపెట్టిన డ్యాన్సులు.. కానిస్టేబుళ్లపై చర్యలు..

ABOUT THE AUTHOR

...view details