కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని దాల్మాల్ గుట్టలోని ఓ ఇంట్లో 25 ఏళ్లుగా షరీఫ్ కుటుంబం అద్దెకుంటోంది. షరీఫ్కు పక్షవాతం రావడం వల్ల ఉపాధి కోల్పోయి కుటుంబ పోషణ భారమైంది. ఈ క్రమంలో ఏడాది నుంచి షరీఫ్ ఇంటి అద్దె చెల్లించకపోవడం వల్ల శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు.
అద్దె చెల్లించలేదని ఇంటి నుంచి గెంటేసిన యజమాని..
సొంత ఇల్లు లేక 25 ఏళ్లుగా అద్దెకుంటున్న ఆ కుటుంబాన్ని ఇంటి యజమాని బయటకు గెంటేశాడు. రెండు పడక గదుల ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నా.. ఇప్పటి వరకు వారికి ఇల్లు దొరకలేదు. ప్రభుత్వం స్పందించి తమకు డబుల్ బెడ్రూం ఇల్లును అందజేయాలని కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ఆ కుటుంబం కోరుతోంది.
అద్దె చెల్లించలేదని ఇంటి నుంచి గెంటేసిన యజమాని..
రోడ్డుమీద పడ్డ ఆ కుటుంబం ఏం చేయాలో పాలుపోక రాత్రంతా ఇంటి డాబాపై ఉన్నారు. రెండు పడక గదుల ఇల్లు కోసం దరఖాస్తు చేసుకుని పలు మార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా తమకు ఇల్లు దొరకలేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. తమకు డబుల్ బెడ్రూం ఇల్లును అందజేయాలని కోరారు.