తెలంగాణ

telangana

By

Published : Jun 8, 2020, 6:13 PM IST

Updated : Jun 8, 2020, 7:11 PM IST

ETV Bharat / state

కన్న కూతురిని తల్లిదండ్రులే చంపేశారు

the-parents-who-killed-the-daughter-in-gadwal
జోగులాంబ గద్వాల జిల్లాలో పరువు హత్య

18:12 June 08

పరువు హత్య: నిద్రిస్తున్న కుమార్తెను చంపిన తల్లిదండ్రులు

జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం కల్లుకుంట్లలో పరువు హత్య చోటుచేసుకుంది. నిద్రిస్తున్న కుమార్తె దివ్యను దిండు అదిమిపెట్టి తల్లిదండ్రులు చంపారు. ఏపీలోని కర్నూలులో దివ్య... డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమె ఓ యువకుడిని ప్రేమించిందనే కోపంతో తల్లిదండ్రులు ఈ దారుణానికి ఒడిగట్టారు. గర్భవతి అని తేలడం వల్ల చంపినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... నిందితులను రిమాండ్‌కు తరలించారు.

Last Updated : Jun 8, 2020, 7:11 PM IST

ABOUT THE AUTHOR

...view details