తెరాస ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని అలంపూర్ ఎమ్మెల్యే వి.ఎం అబ్రహం అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తుమ్మిళ ఎత్తిపోతల ద్వారా ఆర్డీఎస్ కాలువకు నీటిని విడుదల చేశారు. రాజోలి మండలం తుమ్మల గ్రామం సమీపంలో తుంగభద్ర నదిపై ఉన్న తుమ్మిళ ఎత్తిపోతల వద్ద స్థానిక నేతలతో కలిసి మోటార్లను ఆన్ చేశారు.
ఆర్డీఎస్ కాలువకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే వి.ఎం అబ్రహం
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తుమ్మిళ ఎత్తిపోతల ద్వారా ఆర్డీఎస్ కాలువకు ఎమ్మెల్యే వి.ఎం అబ్రహం నీటిని విడుదల చేశారు. మిరప, వరి పంటల కోసం అధికారులతో చర్చించి నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
ఆర్డీఎస్ కాలువకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే వి.ఎం అబ్రహం
మిరప, వరి పంటల కోసం అధికారులతో చర్చించి నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఏకైక ప్రభుత్వ తెరాసనేనని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారని చెప్పారు.
ఇదీ చదవండి:పెంపుడు జంతువుల కోసం మొబైల్ సెలూన్లు!