తెలంగాణ

telangana

ETV Bharat / state

వేసవిలో మూగజీవాల దాహం తీరేదెలా..?

మార్చిలోనే భానుడు ఉగ్ర రూపం చూపిస్తున్నాడు. ఎండల తీవ్రతకు నీటి సదుపాయం లేక మనుషులతో పాటు పశువులు అల్లాడుతున్నాయి. జయశంకర్​ జిల్లాలో మూగ జీవాలపై బతికే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువల ద్వారా నీళ్లు వదిలి చెరువులను నింపాలని అధికారులను కోరుతున్నారు.

By

Published : Mar 28, 2019, 3:32 PM IST

మూగ జీవాలు

నీటి సదుపాయం లేక మూగజీవాల అవస్థలు
మార్చి నెలలోనే ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు మూగ జీవాలు సైతం తట్టుకోలేక పోతున్నాయి. జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో ఎండలకు తాళలేక పశువులు అల్లాడుతున్నాయి. వీటి దాహం తీరేందుకు కాలువల ద్వారా నీళ్లను చెరువులకు వదలాలని పశువుల కాపర్లు కోరుతున్నారు. ఎండల తీవ్రత వల్ల భూగర్భ జలాలు అడుగంటకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉన్న చెరువుల్లో నీటిని ఆసాములు మోటార్లు పెట్టి తోడేస్తున్నారని ఆరోపించారు.

పశువులు చనిపోయే పరిస్థితి

పశువులను మేతకు తీసుకెళ్లే సమయంలో కుంటల్లో నీళ్లు లేక అవి చనిపోయే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవి మేసే ప్రాంతాల్లో కుంటలు ఏర్పాటు చేసి నీరందించాలని కోరుతున్నారు. గొర్రెల, బర్రెల సంరక్షణకు పశువైద్యుల నుంచి కూడా ఎలాంటి సూచనలు అందడం లేదని వాపోతున్నారు.
ఇప్పటికైనా అధికారులు, గ్రామ పంచాయతీ సర్పంచ్​లు స్పందించి మూగజీవాల సంరక్షణ చర్యలు చేపట్టాలని పశువుల కాపర్లు కోరుతున్నారు.

ఇదీ చదవండి :"నామీద సర్జికల్​ స్ట్రైక్​ ఎందుకు జరిగిందో"

ABOUT THE AUTHOR

...view details