ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని లాభాల బాటలో నడపాలని ఆలోచనలు చేస్తుంటే... ప్రతిపక్షాలు కార్మికులను రెచ్చగొట్టి సమ్మె వైపు నడిపించాయని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పెద్ద మనసుతో రెండు సార్లు అవకాశం కల్పించినా.. విపక్షాలు దీని ద్వారా లబ్ధిపొందాలనే ఉద్దేశంతోనే కార్మికుల జీవితాలతో అడుకున్నాయన్నారు. ప్రతిపక్షాలకు వేదిక లేకపోవడం వల్లనే ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టి ఈ పరిస్థితికి తీసుకొచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.