తెలంగాణ

telangana

By

Published : Jun 20, 2019, 3:50 PM IST

ETV Bharat / state

జనగామలో సీసీ కెమెరాలు ప్రారంభించిన డీసీపీ

జనగామ జిల్లా అబ్దుల్​ నాగారంలో  సీసీ కెమెరాలను డీసీపీ శ్రీనివాస్​ రెడ్డి, ఏసీపీ వినోద్​ కుమార్​ ప్రారంభించారు. గ్రామ సర్పంచ్​, స్థానికుల సహకారంతో నిఘా నేత్రాలు ఏర్పాటు చేయడాన్ని అభినందించారు.

జనగామలో సీసీ కెమెరాలు ప్రారంభించిన డీసీపీ

జనగామలో సీసీ కెమెరాలు ప్రారంభించిన డీసీపీ

జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అబ్దుల్ నాగారంలో నూతనంగా 11 సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని జనగామ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, ఏసీపీ వినోద్ కుమార్​ ప్రారంభించారు. స్థానిక సర్పంచ్ అర్జుల రమాదేవి, గ్రామస్థుల సహకారంతో స్వచ్ఛందగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంపై డీసీపీ హర్షం వ్యక్తం చేశారు. ప్రతి గ్రామం ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు. ఈ నిఘా నేత్రాలతో గ్రామంలో శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉంటాయని.. స్థానికులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాస్​ రెడ్డి కోరారు.

ABOUT THE AUTHOR

...view details