తెలంగాణ

telangana

By

Published : Mar 29, 2020, 5:38 AM IST

ETV Bharat / state

బయట తిరిగినందుకు రూ. 2 వేలు ఫైన్​

కరోనా మహమ్మారిని పారదోలేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకుండా కఠినంగా వ్యవహిరిస్తున్నా... ఖాతరు చేయకుండా బయట తిరిగిన ఓ వ్యక్తికి రూ. 2 వేల జరిమానా విధించారు.

rs-2-thousand-fine-at-sarangapur-jagtial
బయట తిరిగినందుకు రూ. 2 వేలు ఫైన్​

జగిత్యాల జిల్లా సారంగపూర్‌ మండలం పోతారంలో ఇంట్లో ఉండకుండా బయట తిరిగిన వ్యక్తికి గ్రామ పంచాయతీ సిబ్బంది రూ. 2 వేల జరిమానా విధించారు. మ్యాన నారాయణ రెండు రోజులుగా రోడ్లపై తిరుగుతున్నాడు.

గ్రామ పంచాయతీ సిబ్బంది ఎంత చెప్పినా వినిపించుకోలేదు. విసిగిపోయి రెండు వేల రూపాయలు జరిమానా విధించారు. ఎవరూ బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలంటూ పంచాయతీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చూడండి :బియ్యం, నగదు త్వరలోనే పంపిణి చేస్తాం: సీఎస్

ABOUT THE AUTHOR

...view details