తెలంగాణ

telangana

తెరాస ప్రభుత్వం దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. కల్యాణలక్ష్మి పేరిట పేదింటి ఆడ బిడ్డలకు లక్షకుపైగా ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఆయన కొనియాడారు.

By

Published : Apr 7, 2021, 7:34 PM IST

Published : Apr 7, 2021, 7:34 PM IST

MLA Sunke Ravishankar distributing Kalyana Lakshmi checks
కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

తెరాస ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో 69మంది లబ్ధిదారులకు రూ.69లక్షల కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్​ పని చేస్తున్నారని పేర్కొన్నారు.

ఆడపడుచులను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ అద్భుత పథకమైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ను ప్రవేశపెట్టారన్నారు. దళారులను నమ్మి లబ్ధిదారులు మోసపోవద్దని సూచించారు.

ఇదీ చదవండి:ధోనీ సలహాల వల్లే​ నటరాజన్ ఇలా!

ABOUT THE AUTHOR

...view details