తెలంగాణ

telangana

ETV Bharat / state

అభివృద్ధి పనులకు మంత్రి కొప్పుల శంకుస్థాపన

దశాబ్దాలుగా గ్రామాల్లో నెలకొన్న పారిశుద్ధ్య సమస్య నుంచి విముక్తి కలిగించి అందమైన పల్లెలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం 30 రోజుల కార్యచరణ ప్రణాళికను అమలు చేసిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.

By

Published : Oct 8, 2019, 10:57 AM IST

అభివృద్ధి పనులకు మంత్రి కొప్పుల శంకుస్థాపన

జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ధర్మపురిలో 20 లక్షల వ్యయంతో నిర్మించిన జమ్మిగద్దెను ప్రారంభించారు. అనంతరం బూరుగుపల్లెలో సీసీ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పట్టణంలోని నిర్మాణంలో ఉన్న పనులను పరిశీలించారు. గ్రామాల్లో నెలకొన్న పారిశుద్ధ్య సమస్య నుంచి విముక్తి కలిగించేందుకు, అందమైన పల్లెలుగా తీర్చిదిద్దేందుకే కేసీఆర్ సర్కారు 30 రోజుల కార్యచరణ ప్రణాళికను అమలు చేసిందని మంత్రి తెలిపారు.

అభివృద్ధి పనులకు మంత్రి కొప్పుల శంకుస్థాపన

ABOUT THE AUTHOR

...view details