తెలంగాణ

telangana

By

Published : Apr 6, 2021, 3:09 PM IST

ETV Bharat / state

ఇబ్రహీంపట్నంలో లాక్‌డౌన్.. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో లాక్‌డౌన్ విధించారు. ఉదయం 6 నుంచి 11గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంటాయని పంచాయతీ పాలకవర్గం వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.వెయ్యి జరిమానా విధించాలని నిర్ణయించింది.

ibrahimpatnam lockdown, ibrahimpatnam mandal
ఇబ్రహీంపట్నంలో లాక్‌డౌన్, ఇబ్రహీంపట్నంలో కరోనా కేసులు

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో గ్రామపంచాయతీ పాలకవర్గం లాక్‌డౌన్ విధించింది. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే నిత్యావసర సరుకుల కోసం దుకాణాలు తెరిచి ఉంటాయని పేర్కొంది. మిగతా సమయాల్లో అన్నీ మూసేయాలని.. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.1,000 జరిమానా విధించాలని పాలక వర్గం నిర్ణయించింది. బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

నిర్మానుష్యంగా రహదారులు

కరోనా సోకిన ఇద్దరు వృద్ధుల్లో ఒకరు సోమవారం, మరొకరు మంగళవారం మృతి చెందారు. బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. లాక్‌డౌన్ ప్రభావంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి.

ఇదీ చదవండి:వాటర్ బాటిల్ తెచ్చుకుంటానని చెప్పి భార్య పరార్​.!

ABOUT THE AUTHOR

...view details