కరోనా ఉద్ధృతిని తగ్గించేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను పోలీసులు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి, కోరుట్ల పట్టణాల్లో లాక్డౌన్ పటినష్ఠంగా అమలవుతోంది. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత అనుమతుల్లేని వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు. జాతీయ రహదారిపై ప్రధాన కూడలి వద్ద చెక్పోస్ట్ ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
ఉదయం 10 దాటిన తర్వాత బయటకొస్తే కఠిన చర్యలు
జగిత్యాల జిల్లాలో లాక్డౌన్ పద్నాలుగో రోజును పోలీసులు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వారిని హెచ్చరిస్తూ వాహనాలు జప్తు చేస్తున్నారు.
![ఉదయం 10 దాటిన తర్వాత బయటకొస్తే కఠిన చర్యలు jagtial lock down, metpalli lock down, korutla lock down](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11:30:16:1621922416-tg-krn-11-25-police-thanikeelu-av-ts10037-25052021111948-2505f-1621921788-322.jpg)
జగిత్యాలలో లాక్డౌన్, కోరుట్లలో లాక్డౌన్, మెట్పల్లిలో లాక్డౌన్
అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వారిని హెచ్చరిస్తూ వాహనాలను సీజ్ చేసి తగిన జరిమానా విధిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటలకే దుకాణాలు మూసి వేయాలని, ప్రజలెవరూ బయటకు రావద్దని ప్రత్యేక వాహనాల ద్వారా పట్టణాల్లో ప్రచారం చేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో అనుమతి లేకుండా తెరిచి ఉంచిన దుకాణాలకు మున్సిపల్ అధికారులు జరిమానా విధిస్తున్నారు.