ఏపీ కర్నూల్ జిల్లా నంద్యాల మండలం పొన్నపురం గ్రామానికి చెందిన రమేష్ అనే యువకుడు ఓ యువతిని.. ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న యువతి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. రమేష్ పెళ్లి చేసుకుంటానని.. పెద్దల సమక్షంలో ఒప్పంద పత్రం కూడా రాశాడని బాధితురాలు తెలిపింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రియుడి ఇంటి ముందు యువతి ధర్నా
ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానని ఆ యువతిని నమ్మించాడు. చివరకు కనిపించకుండా పోయాడు. విషయం తెలుసుకున్న యువతి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ కర్నూల్ జిల్లా నంద్యాలలో జరిగిన ఘటన వివరాలివి..!
ప్రియుడి ఇంటి ముందు యువతి ధర్నా
గతంలోనూ ఇలా చేస్తే పోలీసులను ఆశ్రయించానని... వారు కేసు నమోదు చేశారని బాధితురాలు తెలిపింది. కేసు ఉపసంహరించుకుంటే పెళ్లి చేసుకుంటానని రమేష్ నమ్మించాడని.. మళ్లీ మోసం చేసి పరారయ్యాడని ఆవేదన వ్యక్తం చేసింది.