తెలంగాణ

telangana

రాజ్​ భవన్​లో మహిళ దినోత్సవ వేడుకలు

By

Published : Mar 5, 2020, 5:13 AM IST

మహిళలు బలంగా ఉంటేనే సమాజం బలంగా ఉంటుందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం పురస్కరించుకొని హైదరాబాద్​ రాజ్‌భవన్‌లో నిర్వహించిన మహిళ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు.

womens day celebrations at raj bhavan in hyderbad
రాజ్​ భవన్​లో మహిళ దినోత్సవ వేడుకలు

అంతర్జాతీయ మహిళ దినోత్సవం పురస్కారించుకొని రాజ్‌భవన్‌లో మహిళ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాఠోడ్‌, జయసుధ, జీవిత, ఏపీ ఎమ్మెల్యే రోజాతో పాటు పలువురు ప్రాముఖులు పాల్గొన్నారు. వైద్య, విద్య, సేవ వంటి పలు రంగాల్లో విశిష్ట సేవల అందించిన 21 మహిళలను ఘనంగా సత్కరించారు.

మహిళలు బలంగా ఉంటేనే సమాజం బలంగా ఉంటుందని గవర్నర్‌ తమిళిసై అన్నారు. అతివలు అనేక సమస్యలు అధికమిస్తూ.. ఉన్నతస్థాయికి చేరుకోవడం సామాన్య విషయం కాదన్నారు. వారు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర గవర్నర్‌గా కాకుండా ఒక డాక్టర్‌గా చెబుతున్నా.. ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలన్నారు. కళాకారులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి.

రాజ్​ భవన్​లో మహిళ దినోత్సవ వేడుకలు

ఇవీచూడండి:'ఐటీ కారిడార్ ఖాళీ చేయించడం లేదు.. పుకార్లను నమ్మొద్దు'

ABOUT THE AUTHOR

...view details