తెలంగాణ

telangana

By

Published : Nov 22, 2019, 10:08 PM IST

ETV Bharat / state

'ఆర్టీసీలో 33 శాతం వాటాపై భాజపా ఎందుకు స్పందించలేదు'

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేంద్రం జోక్యం చేసుకోవాలని తాము ఎన్నిసార్లు డిమాండ్‌ చేసినా భారతీయ జనతా పార్టీ నుంచి ఎలాంటి స్పందనా రాలేదని పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

'ఆర్టీసీలో 33 శాతం వాటాపై భాజపా ఎందుకు స్పందించలేదు'

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేంద్రం జోక్యం చేసుకోవాలని తాము ఎన్నిసార్లు డిమాండ్‌ చేస్తూ వచ్చినా భాజపా నుంచి ఎలాంటి స్పందన రాలేదని పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. ఆర్టీసీలో 33 శాతం వాటా ఉందని పేర్కొంటున్న కేంద్రం 45 రోజులపాటు ఎందుకు స్పందించలేదని ఆయన నిలదీశారు. తాజాగా కేంద్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ నాయకులు పిల్లి మొగ్గలు వేస్తున్నారని ద్వజ మెత్తారు.

ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు సీఎం కేసీఆర్‌కు ఎంత బాధ్యత ఉందో, బీజేపీకి కూడా అంతే బాధ్యత ఉందని పొన్నం అన్నారు. కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే ఆర్టీసీని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ఎంపీలపైన పోలీసులు దురుసుగా ప్రవర్తించినా కేంద్రంలో అధికారంలో ఉండి కూడా పట్టించుకోలేని దుస్థితి రాష్ట్ర బీజేపీదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి, రాష్ట్రంలో ప్రజారవాణా వ్యవస్థను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

'ఆర్టీసీలో 33 శాతం వాటాపై భాజపా ఎందుకు స్పందించలేదు'

ఇదీ చూడండి : ఏఎస్సై ఆత్మహత్యాయత్నం.. వేధింపులే కారణమా!?

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details