తెలంగాణ

telangana

By

Published : Mar 17, 2021, 4:12 PM IST

ETV Bharat / state

భవర్‌లాల్‌ వర్మను పరామర్శించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

ఇటీవల కరోనాకు గురైన భాజపా రాష్ట్ర సంయుక్త కోశాధికారి భవర్‌లాల్‌ వర్మను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పరామర్శించారు. నగరంలోని భవర్‌లాల్‌ నివాసంలో ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.

kishan reddy, bhawar lal varma
భవర్‌లాల్‌ వర్మ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

భాజపా రాష్ట్ర సంయుక్త కోశాధికారి భవర్‌లాల్‌ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. నగరంలోని ఆయన స్వగృహంలో కుటుంబ సభ్యులను కలిసి వర్మ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. కొవిడ్‌- 19 విపత్కర పరిస్థితుల్లో పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు చేపట్టిన "ఫీడ్ ది నీడ్" కార్యక్రమం సందర్భంగా జంటనగరాల్లో భవర్‌ లాల్‌ సేవలందించారు. ఇటీవల ఆయన కరోనాకు గురై కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇప్పుడిప్పుడే భవర్‌లాల్‌ కోలుకుంటున్నారు.

విషయం తెలుసుకున్న కిషన్‌రెడ్డి.. వర్మ కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా కలిసి ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఏదైనా అవసరమైతే తనను సంప్రదించవలసిందిగా కోరారు.

ఇదీ చదవండి:సభలో భట్టి మాట్లాడుతుండగా.. సీఎం కేసీఆర్​ జోక్యం!

ABOUT THE AUTHOR

...view details