తెలంగాణ

telangana

By

Published : Apr 30, 2022, 8:56 PM IST

Updated : Apr 30, 2022, 11:03 PM IST

ETV Bharat / state

బొత్సకు విద్యుత్ శాఖ కౌంటర్ ఇచ్చినట్లుగా ప్రచారం.. ఫేక్ అని తేల్చిన టీఎస్​ఎస్​పీడీసీఎల్

హైదరాబాద్‌లో కరెంట్ లేదని జనరేటర్ వేసుకుని వచ్చానని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ కౌంటర్ ఇచ్చినట్లుగా సోషల్​ మీడియాలో ఓ వార్త వైరల్ అయింది. అయితే అది ఫేక్ అని తేలింది. బొత్స కరెంట్ బిల్ కట్టలేదని తాము ఎలాంటి పోస్ట్ చేయలేదని విద్యుత్ శాఖ వివరణ ఇచ్చింది.

Botsa
Botsa

TSSPDCL Counter To Botsa: రెండు తెలుగు రాష్ట్రాల నాయకులు మధ్య ప్రస్తుతం కరెంట్ పంచాయితీ నడుస్తోంది. క్రెడాయ్ సమావేశంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పక్క రాష్ట్రం అని సంభోదిస్తూ.. తన మిత్రుడు చెప్పాడంటూ అక్కడి పరిస్థితులను వివరించారు. అయితే ఇందుకు బదులుగా ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌లో తాను ఉండి వచ్చానని అక్కడ కరెంట్‌ లేదని... జనరేటర్ వేసుకుని వచ్చానని చెప్పుకొచ్చారు.

ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల సందర్భంగా టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ స్పందించినట్లుగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. బొత్స 15 నెలలుగా బిల్లు కట్టలేదని

Last Updated : Apr 30, 2022, 11:03 PM IST

ABOUT THE AUTHOR

...view details