తెలంగాణ

telangana

'మహిళల భద్రతపై రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలి'

By

Published : Dec 26, 2019, 5:03 PM IST

Published : Dec 26, 2019, 5:03 PM IST

Updated : Dec 26, 2019, 10:21 PM IST

TS HRC Serious On TRS Government
TS HRC Serious On TRS Government

16:14 December 26

'మహిళల భద్రతపై రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలి'

రాష్ట్రంలో మహిళల భద్రతపై దినపత్రికల్లో వచ్చిన వార్తలను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ సుమోటోగా స్వీకరించింది. దిశ ఘటన జరిగిన పరిసరాలు, గచ్చిబౌలి భవానీనగర్‌లో మహిళల భద్రతపై వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలను పరిగణలోకి తీసుకుంది. గచ్చిబౌలిలోని ఓ కళాశాలలో చదువుతున్న  ఓ విద్యార్థిని ఇంటికి వెళ్లేటప్పుడు... మార్గమధ్యలో కొంతమంది పోకిరీలు అమ్మాయిలపై అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో మహిళ భద్రతపై రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ సీపీకి హెచ్​ఆర్సీ ఛైర్మన్​ జస్టిస్​ చంద్రయ్య ఆదేశాలు జారీ చేశారు.

Last Updated : Dec 26, 2019, 10:21 PM IST

ABOUT THE AUTHOR

...view details