రాష్ట్రంలో మహిళల భద్రతపై దినపత్రికల్లో వచ్చిన వార్తలను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. దిశ ఘటన జరిగిన పరిసరాలు, గచ్చిబౌలి భవానీనగర్లో మహిళల భద్రతపై వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలను పరిగణలోకి తీసుకుంది. గచ్చిబౌలిలోని ఓ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని ఇంటికి వెళ్లేటప్పుడు... మార్గమధ్యలో కొంతమంది పోకిరీలు అమ్మాయిలపై అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో మహిళ భద్రతపై రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ సీపీకి హెచ్ఆర్సీ ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య ఆదేశాలు జారీ చేశారు.
'మహిళల భద్రతపై రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలి'
Published : Dec 26, 2019, 5:03 PM IST
Published : Dec 26, 2019, 5:03 PM IST
|Updated : Dec 26, 2019, 10:21 PM IST
TS HRC Serious On TRS Government
16:14 December 26
'మహిళల భద్రతపై రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలి'
Last Updated : Dec 26, 2019, 10:21 PM IST