తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రగతి భవన్ వచ్చిన టీఆర్​టీ అభ్యర్థుల అరెస్ట్

ముఖ్యమంత్రి కేసీఆర్​కు వినతి పత్రం అందజేసేందుకు ప్రగతి భవన్ వచ్చిన టీఆర్​టీ అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.  తమ గోడు వినిపించుకునేందుకు వస్తే అరెస్ట్ చేస్తారా అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.

By

Published : Jun 8, 2019, 10:47 AM IST

Updated : Jun 8, 2019, 12:31 PM IST

ప్రగతి భవన్ వచ్చిన టీఆర్​టీ అభ్యర్థుల అరెస్ట్

రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ఎంపికైన టీఆర్‌టీ అభ్యర్థులకు పోస్టింగ్‌ ఇవ్వాలని ప్రగతి భవన్‌ వద్ద చేపట్టిన నిరసన అరెస్టుకు దారితీసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​కు వినతి పత్రం అందజేయాలని టీఆర్​టీ అభ్యర్థులు ఉదయం 7 గంటల వరకే బేగంపేటలోని ప్రగతి భవన్​కు చేరుకున్నారు. వర్షం వచ్చినా లెక్కచేయకుండా నిరసన తెలిపారు. తమ గోడును సీఎంకు విన్నవించుకునేందుకు అనుమతివ్వాలని పోలీసులను ప్రాధేయపడ్డారు. అనుమతి లేకుండా అభ్యర్థులు ప్రగతి భవన్‌ వచ్చినందుకు వారిని అరెస్ట్ చేశారు. అనంతరం నిరసన కారులను గోషామహల్‌ పోలీస్ స్టేషన్​కు తరలించారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన తమను అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రశ్నించారు. గోషామహల్‌ పోలీస్ స్టేషన్​లోనే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని సంఘం నాయకులు హెచ్చరించారు.

ప్రగతి భవన్ వచ్చిన టీఆర్​టీ అభ్యర్థుల అరెస్ట్
Last Updated : Jun 8, 2019, 12:31 PM IST

ABOUT THE AUTHOR

...view details