తెలంగాణ

telangana

By

Published : Dec 7, 2020, 7:50 PM IST

ETV Bharat / state

భారత్‌బంద్‌లో పాల్గొనేందుకు సన్నద్ధమైన తెరాస

భారత్‌బంద్‌లో పాల్గొనేందుకు తెరాస సన్నద్ధమైంది. ప్రత్యక్ష ఆందోళనల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. షాద్‌నగర్ సమీపంలో బూర్గుల గేట్ వద్ద కేటీఆర్ రాస్తోరోకోకు హాజరుకానున్నారు.

Trs preparing to participate in the Bharat Bandh
భారత్‌బంద్‌లో పాల్గొనేందుకు సన్నద్ధమైన తెరాస

రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. రేపటి భారత్ బంద్​లో పూర్తిస్థాయిలో పాల్గొనేందుకు సన్నద్ధమైంది. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలందరూ ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొననున్నారు. బెంగళూరు రహదారిపై షాద్​నగర్ సమీపంలోని బూర్గుల గేట్ వద్ద కేటీఆర్ రాస్తోరోకోకు హాజరుకానున్నారు.

ఆలంపూర్​లో మంత్రి నిరంజన్ రెడ్డి, మహేశ్వరం వద్ద మంత్రి సబితా ఇంద్రారెడ్డి, హుజూరాబాద్​లో ఈటల రాజేందర్, హైదరాబాద్​లో తలసాని శ్రీనివాస్ యాదవ్, ఖమ్మంలో పువ్వాడ అజయ్ నిరసనల్లో పాల్గొనాలని నిర్ణయించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి నియోజకవర్గాల్లో రైతులకు సంఘీభావంగా బంద్​లో పాల్గొనాలని తెరాస నాయకత్వం పిలుపునిచ్చింది. తెరాస అనుబంధ సంఘాలు కూడా చురుగ్గా భాగస్వామ్యమయ్యేలా సిద్ధమయ్యాయి. ఉదయం కనీసం రెండు గంటల పాటు బంద్​లో పాల్గొనాలని వ్యాపార, వాణిజ్య సంస్థలను కేటీఆర్ కోరారు.

ABOUT THE AUTHOR

...view details