తెలంగాణ

telangana

'నియోజకవర్గాన్ని మూడేళ్లలో అభివృద్ధి పథంలో నడిపిస్తా'

By

Published : Oct 18, 2019, 7:59 PM IST

హుజూర్​నగర్​ ఉప ఎన్నికల ప్రచారంలో వివిధ పార్టీల నాయకులు నిమగ్నమయ్యారు. పార్టీ అభ్యర్థులతో పాటు పలువురు ముఖ్య నేతలు రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. హుజూర్​నగర్​ పట్టణంలో తెరాస అభ్యర్థి సైదిరెడ్డి ప్రచారం నిర్వహించారు.

TRS CANDIDATE SAIDHIREDDY CAMPAIGN IN HUZURNAGAR BY ELECTIONS

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో ప్రచారం హోరెత్తుతోంది. పట్టణంలో తెరాస అభ్యర్థి సైదిరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఉత్తమ్​కుమార్ రెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా నిధులు దుర్వినియోగం చేసి దోచుకున్నారని విమర్శించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవుతానని... 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రమంత్రి అవుతానని మాయమాటలు చెప్పి ఓట్లు దండుకున్నారని ఆరోపించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ట్రక్కు గుర్తు వల్ల ఉత్తమ్​కుమార్ రెడ్డి గెలిచారన్నారు. మూడేళ్లలో హుజూర్​నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని సైదిరెడ్డి భరోసా ఇచ్చారు.

'నియోజకవర్గాన్ని మూడేళ్లలో అభివృద్ధి పథంలో నడిపిస్తా'

ABOUT THE AUTHOR

...view details