తెలంగాణ

telangana

By

Published : Jan 28, 2021, 5:02 PM IST

ETV Bharat / state

యువతను భాజపా, తెరాసలు మోసం చేశాయి: ఉత్తమ్​

యువతను కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో తెరాసలు మోసం చేశాయని టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్​ ఆరోపించారు. ఉద్యోగులకు కేసీఆర్​ సర్కారు అన్యాయం చేసిందని మండిపడ్డారు.

యువతను భాజపా, తెరాసలు మోసం చేశాయి: ఉత్తమ్​
యువతను భాజపా, తెరాసలు మోసం చేశాయి: ఉత్తమ్​

యువతను భాజపా, తెరాసలు మోసం చేశాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ ధ్వజమెత్తారు. నిరుద్యోగ భృతి రూ.3016 ఇస్తామన్న కేసీఆర్... మరోసారి యువతను మోసం చేశారని ఆరోపించారు. పీఆర్సీ పేరుతో ఉద్యోగులకు కూడా అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యవర్గం ప్రమాణ స్వీకారానికి ఉత్తమ్‌ కుమార్ రెడ్డితోపాటు చిన్నారెడ్డి, ఇతర నేతలు హాజరయ్యారు.

త్వరలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయని యువత, విద్యార్థులు, నిరుద్యోగులు కలిసి కేసీఆర్, మోదీకి బుద్ది చెప్పాలని ఉత్తమ్ అన్నారు. కాంగ్రెస్‌ ఒక్కటే యువతకు అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన తెలంగాణ ఇప్పుడు కేసీఆర్ చేతిలో విలవిలాడుతోందని కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్​ ఉపఎన్నికల్లో కాంగ్రెస్​ గెలుపు కోసం యువజన కాంగ్రెస్​, విద్యార్థి నాయకులు కృషి చేయాలన్నారు.

ఇదీ చదవండి: ఉద్యోగులు తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది: ఉత్తమ్

ABOUT THE AUTHOR

...view details