- ఈరోజు భారీ వర్షాలున్నాయ్..
రాష్ట్రంలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఒడిశా తీరంపై అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి.
- నేటి నుంచే ఎంసెట్... ఆ నిబంధన సడలింపు
ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే... ఎంసెట్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ, రేపు, ఎల్లుండి ఇంజినీరింగ్ విభాగం పరీక్ష జరగనుంది. రోజూ రెండు పూటలు పరీక్ష నిర్వహిస్తుండగా... ఒక్కో సెషన్కు సుమారు 29 వేల మంది హాజరుకానున్నారు. ఒక్క నిమిషం నిబంధన అమలు చేస్తున్నందున.. విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.
- వైభవంగా లష్కర్ బోనాలు... నేడు రంగం
సికింద్రాబాద్ బోనాల జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. ఆదివారం తెలవారుజామునుంచే అమ్మవారిని దర్శించుకున్న భక్తులు... బోనాలు, ఒడిబియ్యం, సారె, సమర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెల్లవారు జామున 4 గంటలకే అమ్మవారికి తొలి బోనం సమర్పించగా... ఎమ్మెల్సీ కవిత 2000 మంది మహిళలతో ఊరేగింపుగా వచ్చి మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, మల్లారెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
- సర్వం వరదార్పణం.. బాధితుల వేదన వర్ణనాతీతం..
గోదావరికి క్రమేణా వరద తగ్గుముఖం పడుతుండగా, కృష్ణాలో శ్రీశైలానికి ప్రవాహం కొనసాగుతోంది. భద్రాచలం వద్ద కూడా నెమ్మదించినప్పటికీ, ఇంకా ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోంది. మరోపక్క నీటమునిగిన జయశంకర్ జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంపుహౌస్లో నీటి తోడివేత(డీవాటరింగ్)కు అధికారులు చర్యలు చేపడుతున్నారు. మంత్రపురిగా పిలుచుకునే మంథని పట్టణ చరిత్రలోనే ఎన్నడూ లేనిరీతిలో వరద ముంచెత్తింది. భద్రాద్రి జిల్లా మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు మండలాల్లో ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఐదు రోజులుగా ప్రాణాలరచేత పట్టుకుని ఉన్న బాధితులు ఇప్పుడు ఆస్తి, పంట నష్టంపై అంచనా వేసుకుంటున్నారు.
- వైకాపా మళ్లీ అధికారంలోకి వస్తే.. అధోగతే
వైకాపా మరోసారి అధికారంలోకి వస్తే ఏపీని ఎవరూ బాగు చేయలేరని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. విధానపరమైన లోపాల గురించి ప్రశ్నిస్తే అసభ్యంగా తిడుతున్నారని, ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి వైకాపా అరాచక పాలనను అంతం చేయాలని పిలుపునిచ్చారు.
- మద్యం తాగి వాహనం నడుపుతున్నారా..