తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తే ఊరుకోం'

రాష్ట్రంలో ఆర్టీసీ ప్రొడక్షన్​ యూనిట్లను బలోపేతం చేయాలని  ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆందోళన బాట పట్టింది. కార్మికులపై అదనపు పనిభారం మోపుతున్నరని, వారికి చెల్లించాల్సిన ఇన్సెంటివ్స్​ను సకాలంలో చెల్లించాలంటూ ఆర్టీసీ కార్మికులు బస్​భవన్​వద్ద నిరసన చేపట్టారు.

By

Published : Jun 22, 2019, 5:06 PM IST

కార్మికుల నిరసన

రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని దశలవారీగా ప్రైవేట్​పరం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆరోపించింది. ఆర్టీసీ ప్రొడక్షన్ యూనిట్లను పటిష్ఠం చేసి, మ్యాన్ అవర్​ రేట్​ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ భవన్ ముందు ధర్నా నిర్వహించారు. కార్మికులపై అదనపు పనిభారం మోపడమే కాకుండా, వారికి చెల్లించాల్సిన ఇన్సెంటివ్స్​ను సకాలంలో ఇవ్వడం లేదంటూ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజ్​రెడ్డి ఆరోపించారు.

ఆర్టీసీ కార్మికుల నిరసన

ABOUT THE AUTHOR

...view details