తెలంగాణ

telangana

ETV Bharat / state

corporations chairman's: మూడు కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం.. రెండేళ్లపాటు విధులు

మూడు కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఛైర్మన్లను నియమించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురు ఛైర్మన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా కార్పొరేషన్ల ఛైర్మన్లుగా ముగ్గురు రెండేళ్ల పాటు బాధ్యతల్లో ఉండనున్నారు.

By

Published : Dec 16, 2021, 5:00 AM IST

chairmen for the three corporations
మూడు కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం

మూడు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా మన్నె క్రిశాంక్, వైద్యసేవలు-మౌలికవసతుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా ఎర్రోళ్ల శ్రీనివాస్, గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌గా సాయిచంద్‌ను నియమించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ముగ్గురు ఛైర్మన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా కార్పొరేషన్ల ఛైర్మన్లుగా ముగ్గురు రెండేళ్ల పాటు బాధ్యతల్లో ఉండనున్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details