తెలంగాణ

telangana

విద్యార్థినిపై అత్యాచారం చేసిన ప్రిన్సిపల్

By

Published : Nov 23, 2019, 8:47 PM IST

విలువలు బోధించాల్సిన గురువు ఓ విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విద్యార్థినిపై ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్ అత్యాచారం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై  పాఠశాల ప్రిన్సిపల్‌ పలు మార్లు అత్యాచారం చేసినట్లు హెల్ప్​లైన్​కు బాధితురాలు ఫిర్యాదు చేసింది.

విద్యార్థినిపై అత్యాచారం చేసిన ప్రిన్సిపల్

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగరంలో దారుణం చోటుచేసుకుంది. జానెట్ జార్జి మెమోరియల్ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థినిపై పాఠశాల ప్రిన్సిపల్ ప్రసాదరావు(47) అత్యాచారం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. గతంలో పలు మార్లు అత్యాచారం చేసినట్లు బాధితురాలు రంగారెడ్డి షీటీమ్, చెల్డ్ హెల్ప్​లైన్​కు ఫిర్యాదు చేసింది. అనంతరం అధికారులు అమ్మాయిని కలిసి కీచక ప్రిన్సిపల్ నుంచి విముక్తి కల్పించారు.

బాధితురాలి ఫిర్యాదుతో కీచక ప్రిన్సిపల్​ను అబ్దుల్లాపూర్ మేట్ పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రసాదరావుతో పాటు తన భార్య కూడా విద్యార్థులను వేధిస్తున్నారని తెలుసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్​ఏ, బీఈడీ పూర్తి చేసిన ప్రసాదరావు 2006 నుంచి ఆ పాఠశాలలో పని చేస్తున్నట్లు తెలిసింది.

విద్యార్థినిపై అత్యాచారం చేసిన ప్రిన్సిపల్

ఇదీ చూడండి : 'ఆర్టీసీకి అప్పుడు రాని నష్టం.. ఇప్పుడెలా వస్తుంది'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details