భారత్లో పెట్టుబడులకు ప్రపంచానికి స్వాగతం పలుకుతున్నామని, తెలంగాణ రాష్ట్రమే దీనికి మొదటి మజిలీ అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన ఆయన సోమవారం ట్విటర్లో ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ బృందానికి తాను నాయకత్వం వహిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలో అత్యంత విలువైన పారిశ్రామిక సంస్థలు అమెరికా తర్వాత హైదరాబాద్ను ఎంచుకున్నాయని తెలిపారు. మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్, గూగుల్, ఫేస్బుక్ సంస్థల ఎమోజీలను ట్విటర్కు జత చేశారు.