తెలంగాణ

telangana

ETV Bharat / state

Governor Tamilisai: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై

Governor Tamilisai at Tirumala: తిరుమల శ్రీవారిని గవర్నర్ తమిళిసై దర్శించుకున్నారు. వేదాశీర్వచనం అనంతరం శేషవస్త్రంతో సత్కరించారు. ప్రజలందరూ కరోనా టీకా వేయించుకోవాలని.. కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.

By

Published : Jan 16, 2022, 11:52 AM IST

Governor Tamilisai tirumala visit
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్

Governor Tamilisai at Tirumala: తిరుమల శ్రీవారిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న గవర్నర్​కు తితిదే అధికారులు స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్.. అందరూ కరోనా వ్యాక్సిన్ వేసుకొని వైరస్ బారి నుంచి రక్షించుకోవాలని కోరారు.

తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలి.

- తమిళి సై సౌందరరాజన్​, గవర్నర్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్

ఇదీచదవండి:దేశంలో కరోనా ఉద్ధృతి.. కొత్తగా 2.71 లక్షల మందికి వైరస్​

ABOUT THE AUTHOR

...view details