తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యి వాడేలా చర్యలు

రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో విజయ నెయ్యి వాడేలా త్వరలోనే చర్యలు తీసుకుంటామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సచివాలయంలో జరిగిన కార్యాలయంలో పశు సంవర్ధక, మత్స్య శాఖల వార్షిక నివేదిక విడుదల చేశారు.

By

Published : Jun 1, 2019, 12:22 AM IST

శ్రీనివాస్ యాదవ్

ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యి వాడేలా చర్యలు

గడచిన నాలుగేళ్లుగా గొర్రెల పెంపకందార్లకు రికార్డు స్థాయిలో మేలు జరిగిందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వ్యవసాయం తర్వాత పశువుల పెంపకానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. వచ్చే నెల చివర్లో రెండో విడత గొర్రెల పంపిణీకి శ్రీకారం చుడతామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో విజయ డెయిరీని పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో విజయ నెయ్యి వాడేలా త్వరలోనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details