తెలంగాణ

telangana

By

Published : Aug 12, 2020, 5:10 PM IST

ETV Bharat / state

'కరోనా బారిన పడిన పేదలకు అండగా ఉంటాం'

కరోనా బారిన పడిన పేదలకు అండగా ఉండేందుకు వారికి రోగనిరోదకశక్తిని పెంచే మాత్రలు పంపిణీ చేస్తున్నట్లు కంటోన్మెంట్ సీఈవో అజిత్ రెడ్డి తెలిపారు. కంటోన్మెంట్ పరిధిలోని ఏడో వార్డులో 250 మందికి వైద్య సిబ్బందికి మాత్రలు పంపిణీ చేస్తామని తెలిపారు.

'కరోనా బారిన పడిన పేదలకు అండగా ఉంటాం'
'కరోనా బారిన పడిన పేదలకు అండగా ఉంటాం'

కంటోన్మెంట్ ఏడో వార్డులోని లాల్​బజార్​ వద్ద కరోనా బాధితులకు లక్ష్మీనరసయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాత్రలను పంపిణీ చేశారు. 250 మందికి వైద్య సిబ్బంది సహకారంతో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కరోనా బారిన పడిన పేద ప్రజలకు ఆర్థికంగా అండగా ఉంటామని తెలిపారు.

లక్ష్మీనరసయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు... ట్రస్ట్ ఛైర్మన్ శ్యామ్ కుమార్ తెలిపారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు పరీక్షల సంఖ్య పెంచడమే కాకుండా... మరొక కేంద్రాన్ని ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details