తెలంగాణ

telangana

By

Published : May 30, 2021, 6:51 PM IST

ETV Bharat / state

RTC MD: ఆర్టీసీ కార్మికులకు వ్యాక్సినేషన్‌ను పరిశీలించిన సునీల్​ శర్మ

హైదరాబాద్ ఎంజీబీఎస్​లో ఆర్టీసీ కార్మికులకు వ్యాక్సినేషన్ అందించే కార్యక్రమాన్ని ఆ సంస్థ ఎండీ సునీల్ ​శర్మ పరిశీలించారు. ఇప్పటి వరకు 50 శాతం ప్రక్రియ పూర్తయినట్లు తెలిపారు.

ఆర్టీసీ కార్మికులకు వ్యాక్సినేషన్‌ పరిశీలించిన సునీల్​ శర్మ
ఆర్టీసీ కార్మికులకు వ్యాక్సినేషన్‌ పరిశీలించిన సునీల్​ శర్మ

రాష్ట్రంలో 45 ఏళ్లు పైబడిన 28 వేల మంది ఆర్టీసీ సిబ్బందికి ఏప్రిల్ నెలలోనే వ్యాక్సినేషన్ పూర్తయిందని ఆ సంస్థ మేనేజింగ్​ డైరెక్టర్​ సునీల్ శర్మ వెల్లడించారు. హైదరాబాద్ ఎంజీబీఎస్​లో ఆర్టీసీ కార్మికులకు వ్యాక్సినేషన్ అందించే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు.

సంస్థలో మిగిలిన 16,840 మంది డ్రైవర్లు, కండక్టర్లకు టీకాలు వేస్తున్నామని సునీల్​ శర్మ పేర్కొన్నారు. ఇప్పటి వరకు 50 శాతం ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఈ సందర్భంగా తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామని సునీల్ శర్మ వివరించారు.

ఇదీ చూడండి: Asaduddin: మరోసారి లాక్​డౌన్ పొడిగించవద్దు: ఎంపీ అసదుద్దీన్

ABOUT THE AUTHOR

...view details