తెలంగాణ

telangana

ETV Bharat / state

కాంగ్రెస్​కి మరో షాక్​...కారెక్కుతున్న సుధీర్​రెడ్డి

హస్తం పార్టీకి షాక్​ల మీద షాక్​లు తగులుతున్నాయి. గెలిచిన శాసనసభ్యులంతా కారెక్కెందుకు వరుసకట్టారు. ఇప్పటికే ఆరుగురు గులాబీ కండువ కప్పుకుంటామని నిర్ణయించుకున్నారు. తాజాగా ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి కూడా తెరాసలో చేరనున్నట్లు ప్రకటించారు.

By

Published : Mar 15, 2019, 10:21 PM IST

Updated : Mar 16, 2019, 1:29 AM IST

గులాబీ గూటికి కాంగ్రెస్​ ఎమ్మెల్యే

ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయించుకున్నారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​తో సమావేశమైన అనంతరం ఈ విషయాన్ని ప్రకటించారు. తెరాస ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు తనని ఆకట్టుకున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమావేశంలో నియోజకవర్గ అభివృద్ధిపై కేటీఆర్ పూర్తిస్థాయి హామీ ఇచ్చినట్లు సుధీర్‌రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్ పరిధిలోని చెరువుల సుందరీకరిణతోపాటు బీఎన్ రెడ్డినగర్‌ రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కరంపై హామీ ఇచ్చారన్నారు.

Last Updated : Mar 16, 2019, 1:29 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details