తెలంగాణ

telangana

ETV Bharat / state

శివాజీ విగ్రహం ఆవిష్కరించిన గాలి

నెలాఖరునా ఆవిష్కరించాల్సిన ఛత్రపతి విగ్రహాన్ని... ఆయన జయంతి రోజున ఓ అనుకోని అతిథి ఆవిష్కరించింది. ఈ ఘటన నిజామాబాద్​లో జరిగింది. ఆ అతిథి ఎవరు?

By

Published : Feb 19, 2019, 8:23 PM IST

నినాదాలు చేస్తున్న ప్రజలు

శివాజీ విగ్రహం ఆవిష్కరించిన గాలి
నిజామాబాద్ జిల్లాలో శివాజీ జయంతి రోజు.. అనుకోని పరిస్థితుల్లో ఆయన విగ్రహం ఆవిష్కృతమైంది. ఖానాపూర్​లోని భాగ్యనగర్ చౌరస్తాలో ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్న శివాజీ విగ్రహంపై కప్పి ఉంచిన కవర్ గాలికి లేచిపోయింది. విగ్రహ ఆవిష్కరణ అయ్యిందని స్థానికులు సంతోషంతో నినాదాలు చేశారు. అనంతరం విగ్రహంపై కవర్ కప్పారు. ఈ నెలాఖరులో స్థానిక ఎమ్మెల్యేతో విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాట్లు చేశారు.

ABOUT THE AUTHOR

...view details