తెలంగాణ

telangana

By

Published : Dec 30, 2020, 12:12 PM IST

ETV Bharat / state

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్​లైన్​లో విడుదల చేసింది. జనవరి నెలకు సంబంధించిన కోటా టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రోజుకు 20 వేల చొప్పున వివిధ స్లాట్లలో టికెట్లు ఉన్నాయి.

special-entry-tickets-released-in-tirumala-chittoor-district in ap
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు విడుదల

జనవరి కోటాకు సంబంధించిన తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్​లైన్​లో విడుదలయ్యాయి. రోజుకు 20 వేల టిక్కెట్ల చొప్పున జనవరి 4 నుంచి 31 వ తేదీ వరకు గానూ రూ.300 టికెట్లను విడుదల చేశారు. భక్తులు తితిదే వెబ్‌సైట్‌ ద్వారా టికెట్లు పొందవచ్చు.

ఒక యూజర్‌ ఐడీ నుంచి 6 టికెట్ల చొప్పున బుక్‌ చేసుకునే సదుపాయం కల్పించారు. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులకు దర్శనం కల్పిస్తున్న తితిదే.. నెలకోసారి టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేస్తోంది. టికెట్లు పొందిన యాత్రికులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తోంది.

ఇదీ చదవండి:రామాలయ నిర్మాణానికి ఐఐటీల సహకారం!

ABOUT THE AUTHOR

...view details