తెలంగాణ

telangana

By

Published : Aug 11, 2020, 8:36 PM IST

ETV Bharat / state

కొనసాగుతున్న సచివాలయం శిథిలాల తరలింపు ప్రక్రియ

సచివాలయ కూల్చివేత ప్రక్రియ నిన్నటితో పూర్తయింది. భవనాల శిథిలాల తరలింపు కొనసాగుతోంది. కలప, ఇనుము, గ్లాస్, అల్యూమినియం తదితరాలను ఇక్కడే వేరు చేసి మిగిలిన శిథిలాలను తరలిస్తున్నారు. ఈ ప్రక్రియ మరో వారం, పది రోజుల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు.

telangana secretariat
telangana secretariat

సచివాలయ భవనాల శిథిలాల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. జులై ఏడో తేదీన ప్రారంభమైన కూల్చివేత ప్రక్రియ నిన్నటితో పూర్తయింది. మిగతా నిర్మాణాల శిథిలాల తొలగింపు ఇప్పటికే పూర్తి కాగా జే, ఎల్ బ్లాక్ భవనాలకు చెందిన శిథిలాల తరలింపు కొనసాగుతోంది.

కలప, ఇనుము, గ్లాస్, అల్యూమినియం తడితరాలను ఇక్కడే వేరు చేసి మిగిలిన శిథిలాలను తరలిస్తున్నారు. ఈ ప్రక్రియ మరో వారం, పది రోజుల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు. ఆ తర్వాత నేలను పూర్తిగా చదును చేసి కొత్త భవన నిర్మాణానికి సిద్ధం చేయనున్నారు.

ఇదీ చదవండి:'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమష్ఠి కృషితో మెరుగైన వైద్యం సాధ్యం'

ABOUT THE AUTHOR

...view details