తెలంగాణ

telangana

నేడే సకల జనుల సమరభేరి

By

Published : Oct 30, 2019, 5:03 AM IST

Updated : Oct 30, 2019, 7:00 AM IST

నేడు సరూర్​నగర్​ స్టేడియంలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సకల జనుల సమరభేరి సభ జరుగనుంది. ఈ సభకు రాజకీయ నేతలు, పలు సంఘాల నేతలతో పాటు ఆర్టీసీ కార్మిక కుటుంబాలు కూడా పాల్గొంటాయని ఆర్టీసీ జేఏసీ నేతలు వెల్లడించారు.

నేడే సకల జనుల సమరభేరి

ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఇవాళ సకల జనుల సమరభేరి సభ జరుగనుంది. సరూర్​నగర్ స్టేడియంలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సభను నిర్వహిస్తున్నట్లు జేఏసీ నేతలు పేర్కొన్నారు. ఇప్పటికే సభాస్థలిని జేఏసీ నేతలు పరిశీలించారు. ఈ సభలో విపక్ష పార్టీల నేతలతో పాటు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు, ప్రజాసంఘాల నేతలు పాల్గొంటారని జేఏసీ నేతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కార్మికులతో పాటు కార్మిక కుటుంబాల సభ్యులు కూడా భారీ సంఖ్యలో పాల్గొంటారన్నారు. ఈ సభలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని జేఏసీ నేతలు పేర్కొన్నారు.

నేడే సకల జనుల సమరభేరి
Last Updated : Oct 30, 2019, 7:00 AM IST

ABOUT THE AUTHOR

...view details