ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్లో 65 సంవత్సరాల చరిత్రలో మెుదటి సారి వేరుశనగ రికార్డు ధర పలికింది. క్వింటా ధర రూ.8,020 లకు వ్యాపారులు కొనుగోలు చేశారు. మార్కెట్లో మొదటిసారి అధిక ధర పలకడంతో మార్కెట్ ఛైర్మన్ ఉమామహేశ్వరమ్మ, కార్యదర్శి ఉమాపతి రెడ్డి, వైకాపా సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి, బసిరెడ్డిలు.. రైతు సోముగోపాల్ను సన్మానించారు.
చరిత్ర సృష్టించిన వేరుశనగ.. క్వింటా రూ. 8,020
ఏపీలోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్లో చరిత్రలోనే తొలిసారిగా క్వింటా వేరుశనగ గరిష్ఠంగా రూ. 8,020 ధర పలికింది. అత్యధిక ధరకు వేరుశనగను అమ్మిన రైతు సోముగోపాల్ను.. మార్కెట్ ఛైర్మన్ సత్కరించారు.
వేరుశెనగ, కర్నూలు