తెలంగాణ

telangana

By

Published : Jan 24, 2021, 7:45 PM IST

ETV Bharat / state

చరిత్ర సృష్టించిన వేరుశనగ.. క్వింటా రూ. 8,020

ఏపీలోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్​లో చరిత్రలోనే తొలిసారిగా క్వింటా వేరుశనగ గరిష్ఠంగా రూ. 8,020 ధర పలికింది. అత్యధిక ధరకు వేరుశనగను అమ్మిన రైతు సోముగోపాల్​ను.. మార్కెట్ ఛైర్మన్ సత్కరించారు.

high rate record for groundnut, kurnool
వేరుశెనగ, కర్నూలు

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్​లో 65 సంవత్సరాల చరిత్రలో మెుదటి సారి వేరుశనగ రికార్డు ధర పలికింది. క్వింటా ధర రూ.8,020 లకు వ్యాపారులు కొనుగోలు చేశారు. మార్కెట్​లో మొదటిసారి అధిక ధర పలకడంతో మార్కెట్ ఛైర్మన్ ఉమామహేశ్వరమ్మ, కార్యదర్శి ఉమాపతి రెడ్డి, వైకాపా సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి, బసిరెడ్డిలు.. రైతు సోముగోపాల్​ను సన్మానించారు.

ABOUT THE AUTHOR

...view details