తెలంగాణ

telangana

By

Published : May 12, 2021, 7:35 PM IST

ETV Bharat / state

ఇళ్లల్లోనే రంజాన్​ జరుపుకోండి: అసదుద్దీన్ ఓవైసీ

లాక్‌డౌన్‌ ఆంక్షల నేపథ్యంలో రంజాన్-ఈదుల్-ఫితర్ ప్రత్యేక ప్రార్థనలు ఇళ్లల్లోనే చేసుకోవాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కోరారు. ఈనెల 14న జరగనున్న రంజాన్ పర్వదినాన్న ముస్లిం సోదరులంతా ఇళ్లల్లో జరుపుకోవాలన్నారు.

అసద్​ద్దిన్​ ఓవైసీ
అసద్​ద్దిన్​ ఓవైసీ

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఆంక్షల నేపథ్యంలో రంజాన్-ఈదుల్-ఫితర్ ప్రత్యేక ప్రార్థనలు ఇళ్లల్లోనే చేసుకోవాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సూచించారు. నిబంధనలతో మసీదుసు మూసివేసిన దృష్ట్యా ఈనెల 14న జరగనున్న రంజాన్ పర్వదినాన్న ముస్లిం సోదరులంతా ఇళ్లల్లో జరుపుకోవాలన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షలు విధించిందన్నారు. లాక్​డౌన్​ పేద ప్రజలు కష్టాల్లో ఉన్నారని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details