నిర్మాణ కార్మికుల నిధులను దారి మళ్లించారని... దీనిపై సమగ్ర విచారణ జరపాలని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి 300 కోట్లు.. పౌరసరఫరాల శాఖకు కరోనా సహాయం పేరుతో మళ్లించారని... ఇది నిబంధనలకు విరుద్ధమని అందులో పేర్కొన్నారు.
కార్మికుల నిధుల మళ్లింపుపై హెచ్ఆర్సీకు రాములు నాయక్ ఫిర్యాదు
నిర్మాణ కార్మికుల నిధులు మళ్లించారంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన హెచ్ఆర్సీ జూన్ 8న విచారణకు రావాలని పౌర సరఫరాల అధికారులకు సమాచారమిచ్చింది.
కార్మికుల నిధుల మళ్లింపుపై హెచ్ఆర్సీకు రాములు నాయక్ ఫిర్యాదు
ఈ ఫిర్యాదుపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారణను స్వీకరించింది. జూన్ 8న విచారణకు హాజరు కావాలని పౌర సరఫరాల అధికారులకు సమాచారమిచ్చింది.
ఇదీ చూడండి:కరోనాను జయించిన వారి సాయంతో వైరస్కు కళ్లెం!