తెలంగాణ

telangana

By

Published : Jun 14, 2020, 8:00 AM IST

ETV Bharat / state

'సీఎం కేసీఆర్‌ పరిపాలనపై ఉద్యమం రాక తప్పదు'

సీఎం కేసీఆర్‌ పరిపాలనపై, దోపిడీలపై ఉద్యమం రాక తప్పదని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హెచ్చరించారు. కాంగ్రెస్‌ నేతలు ప్రాజెక్టుల సందర్శనకు వెళుతుంటే కేసీఆర్‌ వెన్నులో భయం పుట్టుకొచ్చిందన్నారు. ఏడాదికి 25 వేల కోట్లు ఖర్చు పెడతానని చెప్పిన సీఎం కేసీఆర్​ ఆరేళ్ల కాలంలో 96 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు.

ponnala laxmaiah on cm KCR backs panic
'కేసీఆర్‌ పరిపాలనపై ఉద్యమం రాక తప్పదు'

కేసీఆర్‌ దోపిడి వెలుగులోకి వస్తుందని గోదావరి ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లకుండా కేసీఆర్‌ ప్రభుత్వం అడ్డుకుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. అందుకు పోలీసుల సహాయంతో వెళ్లనీకుండా ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులు చేశారని తెలిపారు. తానూ రాజకీయ ఆరోపణలు చేయడం లేదని... రాష్ట్ర ప్రజలు చైతన్య వంతులని కేసీఆర్‌ వైఖరి కారణంగానే మరొక ఉద్యమం వస్తుందని పొన్నాల అన్నారు.

గత కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2004లో తెలంగాణ రాష్ట్రంలో 38 ప్రాజెక్టులకు లక్షా తొమ్మిది వేల 791 కోట్లు అనుమతులు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అదే ఆంధ్ర, రాయలసీమల్లో ప్రాజెక్టుల నిర్మాణాలకు చెంది కేవలం రూ.80,806 కోట్ల రూపాయల విలువ పరిపాలన అనుమతులు ఇచ్చినట్లు వివరించారు.

ఆంధ్రపాలకుల హయాంలోనే రాష్ట్రానికి మేలు జరిగిందని.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 8500 కోట్లు ఖర్చు చేస్తే 34 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుందని పేర్కొన్న కేసీఆర్‌ ఎందుకు ఆ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని ప్రశ్నించారు. ఏడాదికి 25 వేల కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెడతానని చెప్పిన సీఎం కేసీఆర్.. గడిచిన ఆరేళ్ల కాలంలో 96 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు.

'కేసీఆర్‌ పరిపాలనపై ఉద్యమం రాక తప్పదు'

ఇదీ చూడండి :స్పిన్నింగ్ మిల్లుల సంక్షోభం.. జీతాలు లేక కార్మికుల అవస్థలు

ABOUT THE AUTHOR

...view details