తెలంగాణ

telangana

ETV Bharat / state

'అపరిచిత వ్యక్తులు కనిపిస్తే మాకు సమాచారం ఇవ్వండి'

ప్రజల్లో అభద్రతా భావాన్ని తొలగించేందుకు నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు మోండా మార్కెట్ ఎస్సై శంకర్ యాదవ్ తెలిపారు.

By

Published : Jan 31, 2020, 9:08 AM IST

polices doing cordon serch in monda market at Secunderabad
'అపరిచిత వ్యక్తులు కనిపిస్తే మాకు సమాచారం ఇవ్వండి'

మహంకాళి ఏసీపీ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదయ్యనగర్​లో 80మంది పోలీసులతో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. దాదాపు 100కు పైగా ఇళ్లల్లో సోదాలు చేసినట్లు వెల్లడించారు.

సరైన ధ్రువపత్రాలు లేని 21 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని... ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై శంకర్ యాదవ్ వెల్లడించారు. అపరిచిత వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజల్లో అభద్రతా భావాన్ని తొలగించేందుకే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

'అపరిచిత వ్యక్తులు కనిపిస్తే మాకు సమాచారం ఇవ్వండి'

ఇవీ చూడండి:పోలీస్ కొలువు మాకొద్దు బాబోయ్..

ABOUT THE AUTHOR

...view details