తెలంగాణ

telangana

ETV Bharat / state

మత్తు ఖరీదు ప్రాణం.....

మద్యపానం వల్ల ఎన్నో జీవితాలు గుల్లవుతున్నాయి. మద్యం మత్తులో వారు చేస్తున్న పనులు వారి జీవితాలనే బలితీసుకుంటున్నాయి. వారిని నమ్ముకున్న వారు రోడ్డు పాలవుతున్నారు.

By

Published : Jul 3, 2019, 12:08 AM IST


లాలాపేట్​లో నాలా గోడ పై కూర్చుని, మద్యం తాగుతూ కింద పడి ఒక వ్యక్తి మృతి చెందాడు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో నాల పక్కన ఎవరో పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. దగ్గరికెళ్లి చూడగా అప్పటికే అతడు మరణించాడు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు. మద్యం మత్తులో కింద ఉన్న రాయిపై పడటంతో తలకు గాయమై మరణించినట్లు నిర్ధరించారు. మృతుడి వివరాలు సేకరిస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details