రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి రెండో డోసు వ్యాక్సిన్కు మాత్రమే అనుమతి ఉండడం వల్ల ప్రజలు ఆసుపత్రుల వద్ద బారులు తీరారు. కూకట్పల్లిలోని ఎల్లమ్మ బండ యూపీహెచ్సీ, కూకట్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్దకు ఉదయం నుంచే పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు.
మీకు టీకా కావాలా.. కరోనా కావాలా.. భౌతిక దూరమేది?
కూకట్పల్లిలోని ఎల్లమ్మ బండ యూపీహెచ్సీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద వ్యాక్సిన్ తీసుకునేందుకు వచ్చిన ప్రజలు భౌతిక దూరం పాటించడం లేదు. గుంపులు గుంపులుగా ఎగబడుతూ.. సిబ్బందిని ఇబ్బంది పెట్టారు. గంటల తరబడి వేచి చూస్తున్నా వ్యాక్సిన్ వేసేందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రజలు ఆరోపించారు.
Ellamma Banda uphc, Kookat Palli phc, physical distance
గంటల తరబడి వేచి చూసినా.. వ్యాక్సిన్ అందడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. టీకా తీసుకునేందుకు ఆసుపత్రి వద్దకు పెద్ద సంఖ్యలో స్థానికులు వచ్చారు. దూరం పాటించాలని ఆసుపత్రి సిబ్బంది చెప్పినప్పటికీ.. ప్రజలు పట్టించుకోవడం లేదు. నమోదు ప్రక్రియ దగ్గరా భౌతిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా ఎగబడి.. సిబ్బందిని గంటపాటు ఇబ్బంది పెట్టారు.
ఇదీ చూడండి:హ్యాండ్ శానిటైజర్: అపోహలు-వాస్తవాలు!