తెలంగాణ

telangana

By

Published : Jun 14, 2020, 5:15 PM IST

ETV Bharat / state

డిగ్రీ సెమిస్టర్ ఫీజులు రద్దు చేయాలని ఎన్​ఎస్​యూఐ ఆందోళన

డిగ్రీ విద్యార్థుల సెమిస్టర్ ఫీజును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ... ఎన్​ఎస్​యూఐ నాయకులు హైదరాబాద్​లోని ట్యాంక్​బండ్​ వద్ద ఆందోళన చేశారు.

nsui leaders protest
ట్యాంక్​బండ్​పై ఎన్​ఎస్​యూఐ నాయకుల ఆందోళన

డిగ్రీ విద్యార్థుల ఫీజును మాఫీ చేయాలంటూ ఎన్​ఎస్​యూఐ హైదరాబాద్​లో ఆందోళనకు దిగింది. సీఎం కేసీఆర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... ట్యాంక్​బండ్​పై నిరసన చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో... ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద విద్యార్థి కుటుంబాలు పరీక్ష ఫీజులు ఎలా కడతాయని ప్రశ్నించారు.

ఇదివరకే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, జిల్లా కలెక్టర్​కి వినతిపత్రం ఇచ్చామని తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. ప్రశ్నించే గొంతుకు సంకెళ్లు వేయటం సిగ్గుచేటని... విద్యార్థుల కోసం అనుక్షణం పోరాటం చేస్తున్న తమపై కేసులు పెట్టడం దారుణమని తెలిపారు.

ఇవీ చూడండి:స్వచ్ఛతే ఆరోగ్య సోపానం.. అవగాహనే కీలకం

ABOUT THE AUTHOR

...view details