తెలంగాణ

telangana

By

Published : Sep 20, 2020, 7:51 PM IST

ETV Bharat / state

మూసీ ప్రక్షాళన పిటిషనపై సోమవారం విచారణ

మూసీ నది ప్రక్షాళనపై దాఖలైన పిటిషన్​పై సోమవారం జాతీయ హరిత ట్రైబ్యూనల్ విచారించనుంది. సీపీసీబీ, రాష్ట్ర పీసీబీలు సమర్పించిన నివేదికను పరిశీలించి మూసీ నది కాలుష్య అంశంపై ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.

మూసీ ప్రక్షాళన పిటిషనపై సోమవారం విచారణ
మూసీ ప్రక్షాళన పిటిషనపై సోమవారం విచారణ

మూసీనది ప్రక్షాళనపై దాఖలైన పిటిషన్​ను జాతీయ హరిత ట్రైబ్యూనల్​ సోమవారం విచారించనుంది. పారిశ్రామిక, గృహా వ్యర్థాల కలయిక, నాలాల ఆక్రమణలతో మూసీ నది కాలుష్యం అవుతోందని మహ్మద్ నయీ పాషా సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్​పై ఎన్జీటీ.. కాలుష్య నివారణకు తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని గత విచారణలో కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లను ఆదేశించింది. సీపీసీబీ, రాష్ట్ర పీసీబీలు సమర్పించిన నివేదికను పరిశీలించి సోమవారం మూసీ నది కాలుష్య అంశంపై ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details