బోయిన్పల్లిలో మంత్రి మాల్లారెడ్డికి ముస్లిం సోదరులు, పార్టీ నాయకులు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపి ఆయనకు గౌరవప్రదంగా శాలువా కప్పారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని మంత్రి కోరారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు.
మంత్రికి రంజాన్ శుభాకాంక్షలు చెప్పిన ముస్లిం సోదరులు
మంత్రి మాల్లారెడ్డికి బోయిన్పల్లి ముస్లిం సోదరులు, పార్టీ నాయకులు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని మంత్రి సూచించారు.
![మంత్రికి రంజాన్ శుభాకాంక్షలు చెప్పిన ముస్లిం సోదరులు Muslim Brothers ramadan greet the Minister malla reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7340090-929-7340090-1590398440137.jpg)
మంత్రికి రంజాన్ శుభాకాంక్షలు చెప్పిన ముస్లిం సోదరులు
ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు, పార్టీ మైనార్టీ నాయకులకు ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోయినపల్లి యువ నాయకుడు టింకు గౌడ్, సులేమాన్, బద్రు, మున్ను, ముస్లింలు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :'కార్లు ఎందుకు తగలబడుతున్నాయో తెలుసుకోండి..'