తెలంగాణ

telangana

చైతన్యపురి సీఐపై చర్యలు తీసుకోవాలి: రాజాసింగ్

చైతన్యపురి సీఐ రవికుమార్​పై పోలీసులు శాఖపరమైన చర్యలు తీసుకోవాలని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. భాజపా కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్​ చేయడాన్ని ఖండించారు. సీఐపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

By

Published : Nov 30, 2020, 9:32 PM IST

Published : Nov 30, 2020, 9:32 PM IST

mla rajasingh compliant on chaitanyapuri ci in hyderabad
చైతన్యపురి సీఐపై చర్యలు తీసుకోవాలి: రాజాసింగ్

హైదరబాద్​లోని చైతన్యపురి సీఐ రవికుమార్​పై ఏసీపీకి ఫిర్యాదు చేస్తున్నామని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్లడించారు. అతనిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

భాజపా కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్​ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా జరగాలంటే అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. ఎన్నికలు ప్రశాంతంగా జరుగడంలో భాజపా కార్యకర్తలు ముందుంటారని రాజాసింగ్​ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:బెట్టింగ్​: మొదట సరదా.. తర్వాత వ్యసనం.. చివరికి..?

ABOUT THE AUTHOR

...view details